అమరావతి : ఏపీ(Andhrapradesh) ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి పార్టీల్లో సీట్ల కేటాయింపు కొత్త సమీకరణాలకు కారణమవుతున్నది. సీట్లు దక్కని అసంతృప్త నేతలు పార్టీ వీడతున్నారు. తాజాగా జనసేన(Jana Sena) నేత పోతిన మహేష్(Pothina Mahesh), మాజీ ఎమ్మెల్యేలు పాముల రాజేశ్వరి, రమేశ్ రెడ్డి సీఎం జగన్ సమక్షంలో బుధవారం వైసీపీలో(YCP) చేరారు.
వీరికి సీఎం జగన్ పార్టీ జెండా కప్పి వైఎస్సార్ సీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. కాగా, విజయవాడ వెస్ట్ ఆశించి భంగపడ్డ పోతిన మహేష్ రెండు రోజుల క్రితం జనసేన పార్టీకి గుడ్ చెప్పారు. ఈ సందర్భం జనసేన అధినేత పవన్ కల్యాణ్పై తీవ్ర ఆరోపణలు చేశారు. తాను పార్టీ కోసం కష్టపడినా గుర్తింపు దక్కలేదని పోతిన మనస్తాపానికి గురై రాజీనామా చేసారు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు కోసం మహేష్ చివరి వరకు ప్రయత్నించారు. కానీ, పొత్తులో భాగంగా సీటు బీజేపీకి దక్కింది. అక్కడ నుంచి కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి పోటీ చేస్తున్నారు. దీంతో మహేష్ తన అనుచరులతో కలిసి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.