అమరావతి : రాష్ట్రాన్ని సర్వనాశనం పట్టించిన ఏపీ సీఎం వైఎస్ జగన్( CM Jagan) ను ఇంటికి పంపించే సమయం ఆసన్నమయ్యిందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు( Chandra Babu) అన్నారు. ఎన్నికల ప్రచారం(Election Campaign) లో భాగంగా అనంతపురం జిల్లా రాప్తాడులో నిర్వహించిన రోడ్షోలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర భవిష్యత్ కోసం టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి పనిచేస్తున్నాయని వెల్లడించారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు కూటమికి మద్దతు ఇవ్వాలని కోరారు.
ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వా్నికి ఏడు ప్రశ్నలకు సమాధానమివ్వాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా(Special Status) , సీపీఎస్ రద్దు, మద్య నిషేదం, ఏటా జాబ్ క్యాలెండర్(Job Calander) , మెగా డీఎస్సీ(Mega DSC) , కరెంటు చార్జీల తగ్గింపు, పోలవరం పూర్తి ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. అవినీతిపరులు, అసమర్ధత ముఖ్యమంత్రి ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా మోసం చేశారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే గోదావరి జలాలను రాయలసీమకు తీసుకొచ్చే బాధ్యత టీడీపీ తీసుకుంటుందని అన్నారు.