అమరావతి : అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేస్తు రైతులు చేపట్టిన మహాపాదయాత్రపై మంత్రి పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఏపీ సర్కార్ మూడు రాజధానుల బిల్లును ఉపసంహరణపై ఆయన స్పందించారు. పాదయాత్రలో పాల్గొంటున్నది రైతులు కాదని, వారంతా పేయిడ్ ఆర్టిస్ట్లని వ్యాఖ్యనించారు.
రైతుల పాదయాత్ర లక్షల మందితో సాగుతోందా అని ప్రశ్నించారు. పాదయాత్రను చూసి జగన్ ప్రభుత్వం బిల్లులను ఉపసంహరించుకోలేదని స్పష్టం చేశారు. బిల్లుల ఉపసంహరణ అమరావతి రైతుల విజయం కాదని పేర్కొన్నారు. బిల్లుల ఉపసంహరణ ఇంటర్వెల్ మాత్రమేనని, శుభం కార్డుకు సమయం ఉందని వెల్లడించారు. తాను ఇప్పటికీ మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నానని తెలిపారు.