అమరావతి : ఆంధ్రప్రదేశ్లో 11 మంది ఐపీఎస్ ( IPS ) పోలీసు ఉన్నతాధికారులను ప్రభుత్వం బదిలీ (Transfers) చేసింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖపట్నం సీపీగా ఎ. రవిశంకర్ అయ్యన్నార్ , స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఐజీగా త్రివిక్రమ వర్మ, విశాఖ శాంతి భద్రతల డీసీపీగా కె. శ్రీనివాసరావు , విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అదనపు డీజీగా కుమార్ విశ్వజిత్ ను బదిలీ చేశారు.
వైఎస్సార్ జిల్లా ఎస్పీగా సిద్దార్ధ్ కౌశల్, అనంతపురం ఎస్పీగా అన్బురాజన్ , గ్రేహుండ్స్ ఎస్పీగా వి. విద్యాసాగర్ నాయుడు, అన్నమయ్య జిల్లా ఎస్పీగా బొడ్డేపల్లి కృష్ణారావు, తూర్పు గోదావరి జిల్లా ఎస్పీగా పి. జగదీష్, 14వ బెటాలియన్ కమాండెంట్గా ఆర్. గంగాధరరావు, ఏసీబీ ఎస్పీగా అద్నాన్ నయీం అస్మీ బదిలీను ప్రభుత్వం బదిలీచేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.