హైదరాబాద్, సెప్టెంబర్25 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్లో 16 మంది ఐపీఎస్లను బదిలీ చేస్తూ ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఐడీ ఐజీగా వినీత్ బ్రిజ్ లాల్ను, పీ అండ్ ఎల్ ఐజీగా ఎం రవి ప్రకాశ్ను, ఇంటెలిజెన్స్ ఐజీగా పీహెచ్ డీ రామకృష్ణను, ఇంటెలిజెన్స్ ఎస్పీగా ఫకీరప్పను బదిలీ చేశారు. అమ్మిరెడ్డిని డీజీపీ కార్యాలయంలో డీఐజీ అడ్మిన్గా, సీహెచ్ విజయరావుకు రోడ్ సేఫ్టీ అథారిటీగా, సిద్ధార్థ్ కౌషల్కు శాంతి భద్రతల ఏఐజీగా, మేరీ ప్రశాంతిని విశాఖ శాంతి భద్రతల డీసీపీ-2గా నియమించారు.
తుహిన్ సిన్హాను అనకాపల్లి ఎస్పీగా, ఎం దీపీకను ఏపీఎస్పీ-3 బెటాలియన్ కమాండెంట్గా, జీ రాధికకు ఒంగోలులోని పోలీసు ట్రైనింగ్ కళాశాల ప్రిన్సిపాల్గా, ఆరిఫ్ హఫీజ్కు ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ ఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు. కేఎస్ఎస్వీ సుబ్బారెడ్డిని పీటీవో ఎస్పీగా నియమించారు. బాపూజీ అట్టాడ, కేవీ శ్రీనివాసరావును పోలీసు హెడ్ క్వార్టర్స్లో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కే తిరుమలేశ్వర్రెడ్డిని ఎన్టీఆర్ కమిషనరేట్లో క్రైమ్ డీసీపీగా నియమించారు.