అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు కలిపి మొత్తం 9లక్షల 14వేల 423 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. వృత్తి విద్య పరీక్షలను 87, 435 మంది రాయనున్నారు. ఈ పరీక్షలకు గాను అధికారులు 1,456 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగనున్నాయి.
పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ను విధించారు. పదో తరగతి పరీక్షల్లో వరుసగా ప్రశ్న పత్రాలు లీక్ కావడంతో ముందస్తుగా అధికారులు పరీక్ష కేంద్రాల్లో గట్టి చర్యలు తీసుకున్నారు.