అమరావతి : కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు తిరుమలకు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. దీంతో తిరుమలలో రద్దీ పెరగడంతో 22 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనానికి ఎదురుచూస్తున్నారు. దర్శనానికి 24 గంటల సమయం పడే అవకాశముందని అధికారులు వెల్లడించారు.
కాగా నిన్న శ్రీవారిని 61,278 మంది భక్తులు దర్శించుకోగా 30, 585 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.32 కోట్లు వచ్చిందని వెల్లడించారు.