హైదరాబాద్ : (Weather Report) ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి కొనసాగుతున్నది. దీని కారణంగా రానున్న 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నది. ఈ మేరకు వాతావరణ కేంద్రం అధికారులు ప్రజలకు వాతావరణ సమాచారం అందజేశారు. అల్పపీడనం ప్రభావంతో బుధ, గురువారాల్లో దక్షిణ కోస్తాలో అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలో పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంన్నది. భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు.
పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ గురువారం తెల్లవారు జామున వాయుగుండం ఉత్తర తమిళనాడు తీరానికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉన్నది. రానున్న 4 రోజుల పాటు దక్షిణకోస్తా-తమిళనాడు తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలున్నాయి.
అక్కడ మొబైల్స్ కొట్టేస్తున్నరు.. ఇక్కడ అమ్మేస్తున్నరు..
5200 అడుగుల ఎత్తులో ఉన్న ఈ గ్రామానికే రెండే దారులు..
కొత్తగా పెళ్లయిందా? ఈ ఏడింటినీ దాటేస్తే అంతా ఆనందమే
శీతాకాలంలో డైట్లో ఆవపిండి చేర్చుకోండి.. ఆరోగ్యంగా ఉండండి!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..