అమరావతి : ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు వైసీపీ ఎమ్మెల్యే రాజన్నదొర స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏపీ సీఎం జగన్ వర్చువల్ విధానం ద్వారా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న అనంతరం ఎమ్మెల్యే అస్వస్థతకు గురి కావడంతో ఆయన మధ్యలోనే అక్కడి నుంచి వెళ్లిపోయారు. అస్వస్థత కారణంగా పార్వతీపురం ఏరియా ఆస్పత్రిలో చేరి చికిత్సపొందారు.