అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. స్టేట్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్గా గిరిజా శంకర్, పౌర సరఫరాల శాఖ స్పెషల్ సెక్రటరీ, కమిషనర్గా అరుణ్కుమార్, జీఏడీ సెక్రటరీగా పోల భాస్కర్కు అదనపు బాధ్యతలు అప్పగించారు.
గత నెల రోజుల క్రితం కొంతమందిని ఒక శాఖ నుంచి మరో శాఖకకు బదిలీ చేయగా మరికొందరికి అదనపు బాధ్యతలు, పదోన్నతు లు కల్పించారు. వీరిలో హ్యాండ్లూమ్స్, టెక్స్టైల్స్ డైరెక్టర్గా ఉన్న చదలవాడ నాగరాణి సాంకేతిక విద్య డైరెక్టర్గా బదిలీ చేశారు. సాంకేతిక విద్యా శాఖ డైరెక్టర్ బాధ్యతల నుంచి పొల భాస్క ర్ ను రిలీవ్ చేశారు. సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా ఉన్న ఎంఎం నాయక్ను హ్యాండ్లూమ్స్, టెక్స్టై ల్స్ కార్యదర్శిగా బదిలీ అయ్యారు. ఆప్కో సీఎండీ, ఖాదీ విలేజ్ బోర్డు సీఈవోగా అదనపు బాధ్యతలు ఇచ్చారు. ఆప్కో ఎండీ, ఖాదీ–గ్రామీణ పరిశ్రమల శాఖ సీఈవో బాధ్యతల నుంచి చదలవాడ నాగరాణిని రిలీవ్ చేశారు.
బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి. జయలక్ష్మికి సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. మిషన్ క్లీన్ కృష్ణా, గోదావరి కెనాల్స్ కమిషనర్గా ఉన్న కాటంనేని భాస్కర్.. పాఠశాల విద్యా శాఖ పరిధిలోని పాఠశాల మౌలిక వసతుల కమిషనర్గా బదిలీ అయ్యారు. శ్రీనివాసరావును సర్వశిక్ష అభియాన్ రాష్ట్ర అదనపు ప్రాజెక్ట్ డైరెక్టర్గా బదిలీ చేశారు.