అమరావతి : ఆంధ్రప్రదేశ్ నూతన చీఫ్ సెక్రటరీగా సమీర్ శర్మ నియామకం అయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. అక్టోబర్ 1వ తేదీన సీఎస్గా సమీర్ శర్మ బాధ్యతలు చేపట్టనున్నారు. 1985 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ సమీర్ శర్మ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆప్కో సీఎండీగా పని చేశారు.