తిరుపతి : టీటీడీ ఆధ్వర్యంలోని వివిధ ట్రస్టులకు హైదరాబాద్కు చెందిన ఓ దాత భూరీ విరాళం అందజేశారు. తిరుపతి శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో జేఈఓ శ్రీమతి సదా భార్గవికి ఈ మేరకు డిమాండ్ డ్రాఫ్ట్ అందజేశారు.
హైదరాబాద్కు చెందిన శ్రీవారి భక్తురాలు శ్రీమతి వెల్లంకి రాజ రాజేశ్వరి దేవి తన భర్త స్వర్గీయ వెల్లంకి చక్రపాణి జ్ఞాపకార్థం విద్యాదానం ట్రస్టుకు రూ.10 లక్షల 1116, మనవళ్ళు, మనవరాళ్ళ పేరిట గో సంరక్షణ ట్రస్టుకు రూ.2 లక్షలు, అన్నదానం ట్రస్టుకు రూ.2లక్షలు, ప్రాణదానం ట్రస్టుకు రూ.1 లక్ష.. మొత్తం రూ.15 లక్షల 1116 విరాళం అందించారు.
ఈ సందర్భంగా దాతను జేఈఓ శ్రీమతి సదా భార్గవి అభినందించారు. అనంతరం ఆమెకు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. టీటీడీ విద్యావిభాగం డిప్యూటి ఈఓ గోవిందరాజన్ , టీటీడీ ఉద్యోగుల సహకార బ్యాంక్ డైరెక్టర్ చింతాల శివకుమార్ తదితరులు కూడా పాల్గొని దాత వెల్లంకి రాజరాజేశ్వరి దేవిని ప్రశంసల్లో ముంచెత్తారు.