శ్రీశైలం: శ్రీశైలంలో హైదరాబాద్కు చెందిన యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. మౌనికారెడ్డి (25) అనే యువతి శ్రీశైలం ప్రధాన ఆలయానికి సమీపంలో పురుగుల మందు తాగింది. గుర్తించిన స్థానికులు వెంటనే ఆమెను సున్నిపెంటలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువతి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉన్నది. అయితే మౌనికారెడ్డి వద్ద పోలీసు ఫిర్యాదు కాపీ లభించింది.