Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. సర్వదర్శనానికి అన్ని కంపార్టుమెంట్లు నిండి బయట క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి దాదాపు 18 గంటల సమయం పడుతుంది. టైమ్ స్లాట్ (ఎస్ఎస్డీ) దర్శనానికి 12 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా.. శ్రీవారి దర్శనానికి 5 గంటల సమయం పడుతుంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతుంది.
గురువారం నాడు తిరుమల శ్రీవారిని 62,529 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,730 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 4.51 కోట్లుగా ఉంది.