తిరుమల : కోరిన కోరికలు తీర్చే తిరుమల కలియుగ శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి తలనీలాల ద్వారా భారీగా ఆదాయం సమకూరింది. దేశంలో అన్ని ఆలయాల కంటే తిరుమలలోని ఏడుకొండస్వామి చెంత భక్తులు అధిక సంఖ్యలో తలనీలాలు సమర్పించుకుంటారు. ప్రతిరోజు స్వామివారిని దర్శించుకునేవారిలో 30శాతం మంది భక్తులు తలనీలాలు సమర్పించుకుంటారు.
ఇలా భక్తుల సమర్పించుకున్న తలనీలాలను టీటీడీ ప్రతి యేట ఆన్లైన్లో వేలం వేస్తుంది. ఈ-వేలం సైట్లో టీటీడీ వివిధ రకాల సైజుల్లోని తలనీలాలకు వేలం నిర్వహించగా పాటదారులు 21,100 కేజీలకు బిడ్ చేశారు. ఇలా వేలం వేసిన తలనీలాల ద్వారా టీటీడీకి ఈ యేడాది మొత్తం రూ.47.92 కోట్ల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.