అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలంటే స్వార్థం లేకుండా పాలన సాగించే వ్యక్తి కావాలని, అలాంటి సుగుణాలు లేని వ్యక్తి పాలన కొనసాగిస్తుండడం వల్ల ఏపీలో పరిశ్రమలు నెలకొల్పేందుకు ఎవరు ముందుకు వస్తారని టీడీపీ సీనియర్ నాయకుడు అయ్యన్నపాత్రుడు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అవినీతి సీఎం ఉంటే పరిశ్రమలురావు.. పిల్లలకు ఉద్యోగ అవకాశాలు దొరకవని ఆయన పేర్కొన్నారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో నిధుల కేటాయింపునకు సంతకం చేసిన ప్రేమచంద్రారెడ్డిని వదిలి గంట సుబ్బారావును అరెస్టు చేయడం శోచనీయమని పేర్కొన్నారు. ఏపీ లో సీఐడీని కక్ష సాధింపులకు వాడుకోవడం దారుణమని మండిపడ్డారు. ఈ సమావేశంలో టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్, తదితరులు పాల్గొన్నారు.