అమరావతి: ఆంధ్రప్రదేశ్కు తుఫాన్ ముప్పు పొంచిఉన్నది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రవాయుగుండం బుధవారం అర్ధరాత్రి దాటాక తుఫాన్గా మారింది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల వైపుగా వస్తున్నదని వాతావరణశాఖ తెలిపింది. దీనిప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలపై తీవ్ర ప్రభావం ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురవొచ్చని అధికారులు వెల్లడించారు. దీంతో జిల్లా అంతటా రెడ్ అలర్ట్ ప్రకటించారు.
ఐఎండీ సూచనల ప్రకారం ఆగ్నేయ బంగాళాఖాతంలో తుఫాన్ ప్రస్తుతానికి కారైకాల్కు తూర్పు-ఆగ్నేయంగా.. చెన్నైకి సుమారం 700 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉందని రాష్ట్ర విపత్తుల నియంత్రణ విభాగం తెలిపింది. ఈ ప్రభావంతో గురువారం నుంచి మూడు రోజులపాటు దక్షిణ కోస్తాలోని ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
గురువారం నుంచి తీరం వెంబడి గంటకు 50-60 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. సముద్రం అలజడిగా ఉంటుందని.. దక్షిణకోస్తా – తమిళనాడు తీరాల వెంబడి శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించింది. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వెల్లడించింది.
Deep Depression over Southwest and adjoining Southeast Bay of Bengal intensified into a Cyclonic Storm “Mandous” pronounced as “Man-Dous” (Cyclone Alert for north Tamil Nadu, Puducherry and south Andhra Pradesh coasts): India Meteorological Department pic.twitter.com/k6sMwRWqOa
— ANI (@ANI) December 7, 2022