అమరావతి : ఉపరిత ఆవర్తన ప్రభావంతో ఏపీ లో తేలికపాటి వర్షాల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు విజయవాడ, గుంటూరు, ప్రకాశం జిల్లా లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసాయి. విజయవాడలో ఉదయం నుంచి కురుస్తున్న వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గన్నవరం, ఉంగుటూరు మండలాల్లో భారీ వర్షం కురిసింది. ఎనికపాడులో కురిసిన భారీ వర్షానికి రోడ్లపైకి వరద నీరు వచ్చి చేరింది.
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం, పొదిలిలో మోస్తరు వర్షం కురిసింది. గుంటూరు జిల్లాలోని వేమూరు, మాచర్ల నియోజకవర్గంలో వర్షం పడింది . అకాల వర్షంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ముఖ్యంగా కళ్లాల్లో ఉన్న మిరప పంట దెబ్బతింటుందని రైతులు వాపోతున్నారు. మరికొన్న చోట్ల పత్తి తీతలకు సిద్ధంగా ఉండడంతో వర్షాలతో నష్టం జరిగే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.