అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతంలో (Bay of bengal) ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నది. బంగాళాఖాతంలో రేపు మరో అల్పపీడనం ఏర్పడనున్నది. దీంతో ఈనెల 12 వరకు ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో (Coastal district) భారీ వర్షం కురిసే అవకాశం వాతావరణ శాఖ ప్రకటించింది. చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షం కురుస్తుందని, అనంతపురం, కర్నూలు, విశాఖ, విజయనగరం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించింది.