అమరావతి : నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం నరసాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ మృతి చెందాడు. అతివేగంగా వచ్చిన బొలెరో వాహనం ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో ద్విచక్రవాహనంపై ఉన్న హెడ్ కానిస్టేబుల్ శ్రీహరి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు .శ్రీహరి కొండాపురం పోలీస్స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.