తిరుమల : జూన్ 1 నుంచి 5వ తేదీ వరకు అంజనాద్రి ఆకాశ గంగ ఆలయం, జపాలి తీర్థంలో హనుమాన్ జయంతి (Hanuman Jayanti ) ని ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ(TTD) సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఐదు రోజులు ఆకాశ గంగలో బాలాంజనేయ స్వామి (Balanjaneya Swamy) అంజనాదేవికి ప్రత్యేక అభిషేకం నిర్వహించడంతోపాటు జపాలి తీర్థంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.
ఆకాశ గంగలోని అంజనాద్రి ఆలయంలో ఐదురోజుల పాటు ఉదయం 8.30 నుంచి 10 గంటల వరకు అభిషేకం(Abhishekam) జరుగుతుందని ఆలయ అర్చకులు వివరించారు. తొలిరోజు మల్లెపూలతో, జూన్ 2న తమలపాకులతో, 8న ఎర్ర నేరియం, కనకాంబరం పూలతో అమ్మవారికి మహా అభిషేకం, నాల్గవ రోజు చామంతితో, చివరి రోజు సింధూరంతో అభిషేకం కార్యక్రమాలు ఉంటాయని వివరించారు.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నిన్న స్వామివారిని 83,866 మంది భక్తులు దర్శించుకోగా, 44,479 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.15 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. టోకెన్లు భక్తులకు 20 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని
వివరించారు.