అమరావతి : ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేనల మధ్య జరిగిన పొత్తుల వ్యవహరంలో బడుగు, బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతుందని మాజీ మంత్రి, కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు హరి రామజోగయ్య ( Hari Ramajogaiah) ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ, జనసేన కూటమిలో పవన్ (Pawan Kalyan) స్థానం ఏమిటో తెలియక బడుగులకు రాజ్యాధికారం పక్కదారి పడుతుందేమోనని అనుమానం వ్యక్తం చేశారు.
ఈ అంశానికి సముచితమైన సమాధానం కోసం ఎన్నికలైనంత వరకు ఆగటానికి వీల్లేదని పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాల ఆశిస్తున్న ప్రకారం వారి సంతృప్తి మేరకు అధికారం పంచుకోవడంలో పవన్కల్యాణ్, చంద్రబాబు పాత్ర ఏమిటో తెలియకుండా ముందుకు వెళ్లటానికి వీల్లేదని స్పష్టం చేశారు. అధికారంలో సగభాగం జనసేనకు దక్కాలని, పవన్ కల్యాణ్ గౌరవప్రదమైన పదవిని దక్కించుకోవాలని సూచించారు. లేనిపక్షంలో ఈనెల 29న తానే వ్యక్తిగతంగా స్పందించి నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు.