బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా విషయంపై జగన్పై కామెంట్లు చేయడంతో.. విజయసాయి ఇవాళ ట్విట్టర్ వేదికగా స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు. ఏపీ అభివృద్ధిపై వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని జీవీఎల్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు.
‘అయ్యా అబద్దాల నరసింహా.. 2019 ఎన్నికల్లో మేము 22 మంది లోక్సభ సభ్యుల్ని గెలిపించుకోవడం వల్ల మీరు ఏపీకి న్యాయం చేయడం లేదా? లేక మీ పార్టీకి 301 సీట్లు రావడం వల్ల న్యాయం చేయడం లేదా?’ అని ట్విటర్లో ప్రశ్నించారు. రాష్ట్రం కోసం కేంద్రాన్ని అన్నిరకాలుగా అభ్యర్థిస్తున్నామని, ఎంపీగా ఉన్న తమరు ఈ రాష్ట్రానికి ఏం చేశారో చెప్పండి అని విజయసాయిరెడ్డి అడిగారు. అబద్దాలు చెప్పడం మానుకుంటే మంచిదని జీవీఎల్కు విజయసాయిరెడ్డి హితవు పలికారు.