చైన్నై : పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో పర్యావరణ అనుమతుల ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ ఏపీ ప్రభుత్వానికి.. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ రూ.120కోట్ల భారీ జరిమానా విధించింది. పురుషోత్తపట్నం, పట్టిసీమ, చింతలపూడి ఎత్తిపోతల పథకాలకు పర్యావరణ అనుమతులు తీసుకోకుండా చేపట్టినందుకు కూడా జరిమానా గ్రీన్ ట్రైబ్యునల్ జరిమానా వేసింది.
పురుషోత్తంపట్నంకు రూ.24.56 కోట్లు, పట్టిసీమకు రూ.24.90కోట్లు, చింతలపూడికి రూ.73.6 కోట్లు జరిమానా విధించింది. పర్యావరణ ఉల్లంఘనలపై సామాజికవేత్త పెంటపాటి పుల్లారావు, మాజీ ఎమ్మెల్యే వట్టి వసంతకుమార్ ఎన్జీటీకి ఫిర్యాదు చేశారు. జరిమానాను మూడు నెలల్లోగా చెల్లించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఎన్జీటీ ఆదేశించింది. జరిమానా నిధుల వినియోగంపై ఏపీపీసీబీ, సీపీసీబీ సభ్యులతో కమిటీని నియమించాలని ట్రైబ్యునల్ పేర్కొంది.