అమరావతి: ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఏపీపీఎస్సీ చైర్మన్గా నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. గౌతమ్ సవాంగ్.. 1986 బ్యాచ్కి చెందిన ఐపీఎస్ అధికారి. ఆయన 2019, మే 30న ఆంధ్రప్రదేశ్ డీజీపీగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఇంకా ఏడాది పాటు పదవీకాలం ఉండగానే మూడు రోజుల క్రితం ప్రభుత్వం ఆయనను బదిలీ చేసింది. అనంతరం ఏపీపీఎస్సీ చైర్మన్గా నియమించింది.
1986 బ్యాచ్కు చెందిన సవాంగ్.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా మదనపల్లె ఏఎస్పీగా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. అనంతరం చిత్తూరు, వరంగల్ జిల్లాలకు ఎస్పీగా బాధ్యతలు నిర్వహించారు. 2001 నుంచి 2003 వరకు వరంగల్ రేంజి డీఐజీగా, 2003-2004 వరకు స్పెషల్ బ్రాంచ్ డీఐజీగా, 2004-2005 వరకు ఏపీఎస్పీ డీఐజీగా పనిచేశారు.
2005 నుంచి 2008 వరకు సీఆర్పీఎఫ్ డీఐజీగా, 2008-2009 వరకు శాంతిభద్రతల విభాగం ఐజీగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ సర్వీసుల్లోకి వెళ్లిన ఆయన 2016-2018 వరకు విజయవాడ సీపీగా, 2018 జులైలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్గా వ్యవహరించారు. 2019 ఆగస్టు 3న ఏపీ డీజీపీగా ఆయన బాధ్యతలు చేపట్టారు. 2023, జూలైలో పదవీ విరమణ చేయనున్నారు.