తిరుమల: తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామిని శుక్రవారం తెల్లవారుజామున తమిళనాడు గవర్నర్ రవీంద్ర నారాయణన్ రవి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈవో వీరబ్రహ్మం, అర్చకులు ఆలయ మర్యాదాల ప్రకారం ఆలయ మహాద్వారం వద్ద స్వాగతం పలికారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతం రంగనాయకుల మండపంంలో వేదపండితులు వేదాశ్వీరాచనం అందజేశారు. గవర్నర్కు టేబుల్ బుక్ను, ప్రసాదాన్ని అందజేశారు.
ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం
టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు చెన్నైకి చెందిన సి.సెంథిల్ కుమార్ అనే భక్తుడు గ్రీన్ డీజిల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున రూ.10 లక్షలు విరాళంగా అందజేశారు. ఈ మేరకు విరాళం డీడీని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఏఈఓ గోపినాధ్ కు అందజేశారు.ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ రవికుమార్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.