అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గణతంత్ర శుభాకాంక్ష లు తెలిపారు. విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో గవర్నర్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.
విద్యా, వైద్యం, వ్యవసాయం, సాగునీరు, విద్యుత్ తదితర శాఖల అభివృద్ధిని వివరించారు. కొవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారు. ఈ వేడుకల్లో శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం, శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్నారు.