అమరావతి : ఏపీలో ఉద్యోగుల ఆందోళనలు ముదరక ముందే వాటిని పరిష్కరించేందుకు వైఎస్ జగన్ సర్కార్ చర్యలు తీసుకుంటుంది. ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలని ఈనెల 1 వ తేదీన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి జేఏసీ నాయకులు సమ్మె నోటీసు అందజేసి ఈ నెల 7నుంచి ఆందోళనకు పిలుపునిచారు. కాగా ఏపీ ఉద్యోగ జేఏసీ సంఘాల నాయకులతో రేపు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశానికి రావల్సిందిగా ప్రభుత్వం వారిని ఆహ్వానించింది.
పీఆర్సీతోపాటు పలు అంశాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆర్థికశాఖ మానవ వనరుల విభాగం ముఖ్యకార్యదర్శి నుంచి సమాచారం అందింది. ప్రభుత్వ ఆహ్వానంతో ఉద్యోగులు చర్చలకు సిద్ధమవుతున్నారు.