అమరావతి : పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల ఈవో జీవీ సుబ్బారెడ్డి పై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈవో పైవస్తున్న వరుస ఆరోపణలపై స్పందించిన ప్రభుత్వం విచారణకు ఆదేశాలు జారీ చేశారు. వేంకటేశ్వర సేవా సమితి ప్రతినిధులు ఈవో సుబ్బారెడ్డి అవకతవకలపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు.
జంతుబలి ఘటన, గతంలో ఏఈవో రామాచార్యులు మృతికి ఈవో కారణమని, ప్రసాదాల తయారీ, స్టోర్, లీజెస్లలో ప్రతినెల ఈవోకి వాటా అందుతోందని ఆరోపించారు. తలనీలాలలో కాంట్రాక్టర్తో కుమ్మకై ఆలయానికి నష్టం చేస్తున్నారంటూ ప్రభుత్వ కార్యదర్శికి పలు దఫాలుగా ఫిర్యాదులు చేశారు. ఈవో గా అధికార బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సుబ్బారెడ్డి అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈవోపై విచారణకు ఆదేశాలు జారీ చేసింది.