అమరావతి : ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల సమస్య పరిష్కారానికి ఎడతెరపి లేకుండా కసరత్తు చేస్తుంది. ఉద్యోగుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం వరుసగా మూడోరోజు శుక్రవారం కూడా ఆర్థిక శాఖాధికారులు, మంత్రులతో సీఎం జగన్ మోహన్రెడ్డి సమావేశమయ్యారు. దాదాపు మూడు గంటల పాటు జరిగిన చర్చల్లో ఉద్యోగులకు పీఆర్సీ ఫిట్మెంట్తో పాటు ఇతర బకాయిల చెల్లింపులతో పడే బారాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ రోజు మధ్యాహ్నాం 3 గంటలకు సమావేశానికి రావాలని ఉద్యోగ సంఘాల నాయకులకు సమాచారాన్ని పంపించారు.
నిన్న ఉద్యోగ సంఘాలతో భేటీ అయిన సీఎం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. అయితే ఉద్యోగులకు మంచి చేయాలనే తపన ఉందని భరోసా ఇచ్చిన సీఎం ఈ రోజు ఉద్యోగులకు తీపి కబురు అందించేలా తమ నిర్ణయాన్ని ప్రకటిస్తారని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి. ఐఆర్ 26 శాతం కంటే తక్కువ కాకుండా ఇవ్వాలనే ప్రభుత్వం మరీ ఆర్థిక బారం పడకుండా , ఉద్యోగులకు లాభం కలిగించేలా నిర్ణయం ఉండవచ్చని ఉద్యోగ వర్గాలు భావిస్తున్నాయి.