తిరుపతి : దేశ, విదేశాల నుంచి తిరుమలకు విమానంలో వచ్చే భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ (Good News ) చెప్పింది. రేపటి నుంచి విమానాశ్రయంలో శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ కౌంటర్ పున:ప్రారంభించి శ్రీవాణి టికెట్ల(Srinivani Tickets) ను జారీని ప్రారంభిస్తున్నట్లు స్పష్టం చేసింది. విమానయాన ప్రయాణికుల సౌకర్యార్థం గతంలో శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ కౌంటర్ను తిరుపతి విమానాశ్రయంలో నెలకొల్పారు.
గతేడాది డిసెంబర్ 16న తిరుపతి విమానశ్రయంలో ఉన్న శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల కౌంటర్ కి అనుమతి లేదంటు ఏయిర్ పోర్ట్(Airport) అథారిటి అధికారులు కౌంటర్ను మూసివేశారు. తిరిగి ఈ నెల 13 నుంచి ప్రారంభించనున్నామని చెప్పారు. గతంలో మాదిరిగానే శ్రీవాణి టికెట్లు విమాన ప్రయాణికులకు అందుబాటులో ఉంచుతామని, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
బ్రేక్ దర్శనాలకు వెళ్లదలచిన వీఐపీ భక్తులు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా రూ.10 వేలు చెల్లించి దర్శించుకొనేందుకు వీలుగా టీటీడీ ఏర్పాటు చేసింది. ప్రతి నెల కోట విడుదల చేస్తూ వస్తుంది. ప్రతి రోజు 100 ఆఫ్లైన్ శ్రీవాణి టికెట్లను టీటీడీ జారీ చేస్తుందని అధికారులు వెల్లడించారు.