అమరావతి : ఎన్నికల కారణంగా ఏపీలో నిలిచిపోయిన పింఛన్ల (Pensions) పంపిణీ తిరిగి రేపటి నుంచి మూడురోజుల పాటు పంపిణీ చేయడానికి ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. పింఛన్ల పంపిణీపై సెర్ప్ సీఈవో(CEO) ఆదేశాలను ప్రభుత్వం పక్కనపెట్టింది. కేటగిరీల వారీగా పింఛన్లు గ్రామ, వార్డు సచివాలయాల వద్ద పింఛన్ల పంపిణీ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. దివ్యాంగులు, తీవ్ర అస్వస్థతకు గురైన వారికి ఇంటి వద్దే పింఛన్లు అందజేయాలని, గిరిజన ప్రాంతాల వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించింది.
ఎన్నికల కోడ్ (Election Code) ముగిసేంతవరకు వాలంటీర్లు ఎలాంటి పథకాలు పంపిణీ చేయరాదని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇటీవల జారీ చేసింది. దీంతో పింఛన్ వస్తుందో, రావని అధికార, ప్రతిపక్ష నాయకులు తలో మాట మాట్లాడుతుండడడం ఆందోళనకు గురిచేసింది.