అమరావతి : ఏపీలో పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంలో విషాదం చోటుచేసుకుంది. పోలవరంలో ఇంటి నిర్మాణాలకు వచ్చిన ముగ్గురు కూలీలు గోదావరిలో స్నానానికి వెళ్లారు. నీటి ప్రవాహంలో వారు కొట్టుకుపోయి గల్లంతయ్యారు. గల్లంతయిన వారు గోపాలపురం మండలం కొవ్వూరుపాడుకు చెందిన మహేశ్(21), సుబ్రహ్మణ్యం(19), రాజేశ్(19)లుగా గుర్తించారు.
సమాచారం అందుకున్న పోలీసులు,స్థానికులు సంఘటన స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు.