విజయవాడ : (YSR Awards) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కారాల కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది. ఏపీ ఆవిర్భావ దినాన్ని పురస్కరించుకుని వివిధ రంగాల్లో విశిష్ట కృషిచేసిన పలువురికి ప్రభుత్వం అవార్డులతో సత్కరించింది. వైఎస్సార్ సాఫల్య పురస్కారాల ప్రదాన కార్యక్రమం విజయవాడలోని ఏ–కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి పురస్కారాలను అందజేశారు. 2021 సంవత్సరానికి 29 మందికి వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కారాలు, 30 మందికి వైఎస్సార్ సాఫల్య పురస్కారాలను ప్రభుత్వం ప్రకటించింది. లైఫ్టైమ్ అచీవ్మెంట్ పురస్కారం కింద రూ.10 లక్షల నగదుతోపాటు జ్ఞాపిక, యోగ్యతాపత్రం.. సాఫల్య పురస్కారం పొందిన వారికి రూ.5 లక్షల నగదుతోపాటు కాంస్య విగ్రహం, యోగ్యతాపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడారు. నేలపై ఉండి ఆకాశమంత ఎదిగిన వ్యక్తి దివంగత నేత వైఎస్సార్ అని కొనియాడారు. వివిధ రంగాల్లో ఆయా వ్యక్తులు చేసిన సేవలను పరిగణనలోకి తీసుకుని మాత్రమే అవార్డులకు ఎంపిక చేశామన్నారు. సామాన్యులుగా ఉండే అసామాన్యుల ప్రతిభకు పట్టం కట్టామని చెప్పారు. కళలు, సంస్కృతికి అవార్డుల్లో పెద్దపీట వేసినట్లు తెలిపారు. ఈసారి ముఖ్యంగా రైతులు, రచయితలతోపాటు జర్నలిస్టులు, ఫ్రంట్లైన్ వారియర్స్ను కూడా అవార్డులకు ఎంపిక చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున తెలుగుజాతికి వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు.
ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగిస్తూ వైఎస్సార్ సేవల్ని కీర్తించారు. వైద్య వృతి చేసినా.. వ్యవసాయం, విద్యారంగాలకు ఎనలేని కృషి చేశారని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ గుర్తుచేశారు. ఏపీ రాష్ట్ర చరిత్రలో వైఎస్సార్ గొప్ప వ్యక్తిగా నిలిచారని.. పేదల నాడి తెలిసిన వ్యక్తిగా ఆరోగ్యశ్రీని తీసుకొచ్చి పేదల పక్షపాతి అయ్యారని ప్రశంసించారు.
ఏపీలో మిగిలిన స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్.. ఎల్లుండి నుంచి నామినేషన్లు
వైద్యరంగంలో మానవ వనరుల కొరతను అధిగమిద్దాం: వెంకయ్యనాయుడు
ఫిజిక్స్ ప్రశ్నకు సమాధానం కోసం.. ఈ యూట్యూబర్ ఏం చేశాడంటే..?!
అన్నీ వదిలేసి.. ఆ వైన్ బాటిళ్లనే ఎత్తుకెళ్లారు.. ఎందుకో తెలుసా!
శీతాకాలంలో గుండెపోటును ఇలా నివారించండి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..