అమరావతి : ఏపీ అసెంబ్లీ నుంచి నలుగురు టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెన్షన్ చేశారు. సభను పదేపదే అడ్డుకోవడాన్ని సత్యప్రసాద్,రామకృష్ణ, అశోక్,రామరాజులను సభా సమావేశాలు పూర్తయ్యేంత వరకు సస్పెన్షన్ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. టీడీపీ సభ్యుల అనుచిత ప్రవర్తన సరికాదని అన్నారు. కొందరు సభ్యులు సభ గౌరవాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని స్పీకర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన పదిరోజుల నుంచి కూడా టీడీపీ సభ్యులు సమావేశాలను అడ్డుకుంటున్నారు. జంగారెడ్డిగూడెంలో సారామరణాలతో పాటు పలు సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తు స్పీకర్ పోడియంను ముట్టడిస్తూ నినాదాలు చేస్తున్నారు. దీంతో వరుసగా స్పీకర్ టీడీపీ సభ్యుల్లో కొందరిని సస్పెన్షన్ చేస్తున్నారు.