Road Accident | అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు.
వివరాల్లోకి వెళ్తే.. గుడిబండ, అమరాపురం మండలాలకు చెందిన 14 మంది మినీ వ్యాన్లో ఇటీవలే తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. మళ్లీ తమ స్వగ్రామాలకు తిరిగి వస్తున్న క్రమంలో శనివారం తెల్లవారుజామున.. మడకశిర మండలం బుళ్లసముద్రం వద్ద ఆగి ఉన్న లారీని వారి వాహనం ఢీకొట్టింది. దీంతో మినీ వ్యాన్లో ప్రయాణిస్తున్న 14 మందిలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. క్షతగాత్రులను బెంగళూరులోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. మృతుల నివాసాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. క్షతగాత్రుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి..
America | షట్డౌన్ దిశగా అమెరికా.. కీలక బిల్లును తిరస్కరించిన ప్రతినిధుల సభ
Lagacharla | మళ్లీ రైతుల అరెస్టుకు ప్లాన్? తండాల్లో తాండవిస్తున్న భయానక వాతావరణం
RBI | ఉచితాలతో ముప్పే.. ఫ్రీ బస్సుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆందోళన