నెల్లూరు : ఆంధ్రప్రదేశ్లోని నెల్లూర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓజిలి మండలం రాజుపాలెం గ్రామంలో చెరువులో పడి నలుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు, ఓ వ్యక్తి ఉన్నారు. ఆడుకుంటూ వెళ్లి చెరువులో పడిన చిన్నారులను కాపాడేందుకు వెళ్లిన వ్యక్తి కూడా నీటమునిగి ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. మృతులను హేమంత్(6), మాచవరం చరణ్ తేజ(8), జాహ్నవి(12), షేక్ ఖలీల్ (45)గా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర దవాఖానకు తరలించారు. ఘటనాస్థలంలో మృతుల కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.