అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. చెరువులో స్నానానికి దిగి నలుగురు పిల్లలు మృతి చెందారు. ఇద్దరు మృతదేహాలను చెరువులో నుంచి వెలికి తీయగా.. మరో ఇద్దరిని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. జరుగుమిల్లి మండలం అక్కచెరువు పాలెంలో ఈ దుర్ఘటన జరిగింది. ఆరుగురు చిన్నారులు కలిసి స్నానాలు చేసేందుకు దిగారు. ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు.
విషయాన్ని గమనించిన స్థానికులు నలుగురికి కాపాడి ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరి మృతదేహాలను చెరువు నుంచి వెలికి తీశారు. మృతులను కౌశిక్ (16), సుభాష్ (11), సుబ్రహ్మణ్యం (15), హరి భగవన్నారాయణ (10)గా గుర్తించారు. మరో ఇద్దరు బాలికలు మద్దినేని చందన, మున్నంగి చందనను ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతున్నారు. పిల్లల మృతితో ఆయా కుటుంబాల్లో విషాదం అలుముకున్నది. బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే బాలవీరాంజనేస్వామి పరామర్శించారు.