అమరావతి : ఉమ్మడి రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రి, విజయ డెయిరీ డైరెక్టర్ యెర్నేని సీతాదేవి ( Yerneni Sita Devi) మృతి చెందారు. హైదరాబాద్లోని నివాసంలో ఇవాళ సోమవారం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఏపీలోని కృష్ణా జిల్లా (krishna Distruct) కైకలూరు మండలం కోడూరు గ్రామానికి చెందిన ఆమె ముదినేపల్లి ఎమ్మెల్యే(Kaikaloor MLA) గా టీడీపీ నుంచి రెండుసార్లు పోటీ చేసి గెలుపొందారు.
ఉమ్మడి ఏపీలో ఎన్టీఆర్ కేబినెట్లో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన సీతాదేవి కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది. ఆమె భర్త నాగేంద్రనాథ్ ఏపీ రైతాంగ సమాఖ్య, కృష్ణా, గోదావరి, పెన్నా డెల్టా డ్రైనేజీ బోర్డు సభ్యుడిగా, కొల్లేరు పరిరక్షణ కమిటీ అధ్యక్షుడిగానూ పనిచేశారు. ఆమెకు ఇద్దరు కుమారులు, కుమార్తెలు ఉన్నారు. సీతాదేవి మృతిపట్ల టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు(Chandra Babu) సంతాపం, ప్రగాఢ సానుభూతి తెలిపారు. విద్యాశాఖ మంత్రిగా తనదైన ముద్రవేసిన సీతాదేవి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.