Srisailam | శ్రీశైల జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీటి ప్రవాహం తాత్కాలికంగా నిలిచింది. జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ 885 అడుగులు కాగా ప్రస్తుతం 864.70 అడుగులు ఉన్నది. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిసామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 121.2458 టీఎంసీలుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. అదే విధంగా ఏపీ పవర్హౌస్లో 4981 క్యూసెక్కులు, టీఎస్ పవర్హౌస్లో 38,140 క్యూసెక్కుల నీటితో విద్యుత్ ఉత్పత్తి చేసి దిగువన ఉన్న నాగార్జున సాగర్కు విడుదల చేశారు.