అమరావతి : ఎగువన కురుస్తున్న భారీ వర్షాల వల్ల కృష్ణా నదికి నీటి ప్రవాహం పెరిగింది. ముఖ్యంగా విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ (Prakasam barrage) కు వరద ప్రవాహం పెరుగడంతో అధికారులు దిగువకు నీటిని విడుదల (Water release) చేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజ్కు 21,103 క్యూసెక్కుల నీరు వస్తుండగా బ్యారేజ్ 15 గేట్లు అడుగుమేర ఎత్తి 11,135 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
బ్యారేజ్ నుంచి కాల్వలకు 10,176 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజ్ నీటి మట్టం 12 అడుగులు ఉందని అధికారులు వివరించారు. అల్పపీడనం కారణంగా విజయనగరం జిల్లా రేగిడి , ఆముదాలవలసలో 135.75 మి. మీ, శ్రీకాకుళం జిల్లా విజయరామపురంలో 124.75, పార్వతీపురంలో మన్యం జిల్లా చిలకల పల్లెలో 112.5 మి.మీల వర్షం కురిసింది. విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు , ఏలూరు జిల్లాలో వర్షం కురిసింది.