అమరావతి : ఏపీ అసెంబ్లీ నుంచి ఐదుగురు టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెన్షన్ చేశారు. వీరిని రెండు రోజుల పాటు సస్పెన్షన్ చేస్తున్నట్లు ప్రకటించారు. జంగారెడ్డి గూడెంలో సారా మరణాలపై చర్చించాలని పట్టు బడుతూ ఈవాళ అసెంబ్లీలో చిడతలు వాయిస్తూ నిరసన తెలుపడంతో స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసన సభా ఔన్నత్యాన్ని కాలరాస్తున్నారని, రోజురోజుకూ టీడీపీ సభ్యులు దిగజారుతున్నారని స్పీకర్ మండిపడ్డారు. మీరు శాసనసభ్యులే అని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, జోగిరమేశ్ మాట్లాడుతూ విలువైన సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్న టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలను సస్సెండ్ చేయాలని కోరారు. ఎన్నికల తర్వాత టీడీపీ నేతలంతా చిడతలు వాయించు కోవాల్సిందేనని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఓర్వలేక నిరసనలు తెలుపుతున్నారని పేర్కొన్నారు. ఒక్క సమస్యను ఎన్ని రోజులు సాగదీస్తారని ప్రశ్నించారు. సభ్యుల హక్కు లను కాలరాస్తున్నారని ఆరోపించారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా చంద్రబాబు ఏపీలో చీప్లిక్కర్ను ప్రవేశపెట్టారని మంత్రి కొడాలి నాని దుయ్యబట్టారు. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బెల్ట్షాపులను రద్దు చేశారని తెలిపారు.