అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని పామిడి శివారులో జాతీయరహదారిపై కూలీల (Labourers) ఆటోను ఓ లారీ ఢీకొట్టింది. దీంతో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదంలో పలువులురు గాయపడ్డారు. ప్రమాద ధాటికి ఆటో నుజ్జునుజ్జు అయింది. మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. మృతులను గార్లదిన్నె మండలం కొప్పలకొండ వాసులుగా గుర్తించారు. కూలీ పనులకు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.