బాపట్ల: ఆంధ్రప్రదేశ్లోని బాపట్లలో (Bapatla)ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఆదివారం తెల్లవారుజామున బాపట్ల జిల్లాలోని సంతమాగులూరు వద్ద గుంటూరు-కర్నూలు రహదారిపై వేగంగా దూసుకొచ్చిన ఆటో అదుపుతప్పి లారీ ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నరసారావుపేట ప్రభుత్వ దవాఖానుకు తరలించారు. మృతులను నరసరావుపేట ఆర్కెస్ట్రా గ్రూప్నకు చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.