విశాఖపట్నం: విశాఖపట్నం ప్రాంతానికి చెందిన 30 మత్సకార బోట్లు ఒడిశా తీరంలో చిక్కుకుపోయాయి. దీంతో ప్రభుత్వం అప్రమత్తమయింది. తాము ఒడిశా తీరంలో చిక్కుకుపోయామని విశాఖ ప్రాంతానికి చెందిన మత్స్యకారులు ప్రభుత్వానికి సమాచారం చేరశారు. దీంతో ఆంధ్రప్రదేశ్ మత్స్య శాఖ జెడి లక్ష్మణరావు గంజాం పోర్ట్ అధికారులతో చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో అధికారులు గంజాం పోర్ట్ లోకి 17 బోట్లను అనుమతించారు. మిగిలిన బోట్లను కూడా తీరానికి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు వెల్లడించారు. ళాఖాతంలో ఇటీవల ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో చేపల వేటకు వెళ్లిన మత్సకారుల ప్రమాదంలో చిక్కుకున్నారు.