తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన ధర్మరథం బస్సులో మంటలు చెలరేగాయి. సాయంత్రం శ్రీవారి సేవకులను బస్సులో తిరుమలకు తీసుకెళ్తున్న సమయంలో రెండో ఘాట్రోడ్డులో ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. మంటలను గమనించిన డ్రైవర్ వెంటనే బస్సును లింక్ రోడ్డు వద్ద నిలిపివేశాడు. ఆ తర్వాత అందులో ఉన్న భక్తులంతా దిగడంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా.. సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఇటీవల ఘాట్రోడ్డులోనూ ఓ కారులో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే.