Fire Accident | విశాఖపట్నం జగదాంబ సర్కిల్ దగ్గరలో గురువారం అగ్ని ప్రమాదం జరిగింది. ఇండస్ ఆసుపత్రిలో నుంచి ఈ ప్రమాదం జరిగింది. ఆసుపత్రి రెండో అంతస్తు నుంచి దట్టంగా నల్లటి పొగ చెలరేగింది. ఒక్కసారిగా జరిగిన ఘటనతో రోగులు భయాందోళనకు గురై బయటకు పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, పలువురు రోగులను అంబులెన్సుల్లో మరో ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆసుపత్రిలోనే పలువురు రోగులు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.