అమరావతి : ఏపీలోని నెల్లూరు ( Nellore) జిల్లాలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు (Couple) మృతి చెందారు. జిల్లాలోని వెంకటాచలం మండలం చెముడుగుంట వద్ద బైకుపై వెళ్తున్న దంపతుల వాహనాన్ని వెనుక నుంచి అతివేగంగా వచ్చిన ఆటో ఢీ కొట్టింది. దీంతో వారు దంపతులు కిందపడ్డారు. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన బస్సు ఢీకొట్టడంతో భార్యాభర్తలు అక్కడికక్కడే చనిపోయారు. మృతులు వైఎస్ఆర్ నగర్కుచెందిన పుష్ప, ప్రశాంత్గా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.