శ్రీశైలం : మల్లికార్జునస్వామి వెలసిన పుణ్యక్షేత్రం శ్రీశైలం (Srisailam) పరిసరాల్లో ఆహ్లాదవాతావరణం పెంచేందుకు ఆలయ అధికారులు విస్తృతంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇందుల్లో భాగంగా ఆలయ క్షేత్రపరిధిలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. బుధవారం ఆలయ గోశాల (Gosala)లో ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణి రెడ్డి, కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు, సభ్యులు మధుసూదన్రెడ్డి, ఉద్యానవన అధికారి ఎస్.లోకేష్, వేదపండితులు తదితరులు పలు రకాల మొక్కలను నాటారు.
పర్యావరణ పరిరక్షణకు, ఆహ్లాదకర వాతావరణం పెరుగుదలకు ఆలయ పరిసరాల్లో మామిడి, సింహాచలం సంపెంగి, సపోటా(Sapota), పనస, నేరేడు మొక్కలను నాటినట్లు అధ్యక్షులు తెలిపారు. ఇటీవల బాహ్యవలయ రహదారిలో కానుగ, రావి, మర్రి, జువ్వి, వేప, నేరేడు మొక్కలను నాటామని వెల్లడించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కళాకృతులతో కూడిన పలు రకాల మొక్కల కుండీలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయని ఆయన వివరించారు.