అమరావతి : విశాఖపట్నంలో జాతీయస్థాయి 39వ జూనియర్ సాఫ్ట్బాల్ పోటీలు ఏయూ ఇంజినీరింగ్ కళాశాలలో ఘనంగా ప్రారంభయయ్యాయి. ఈ టోర్నిలో 17 రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పాల్గొంటున్నారు. మరో రెండు రోజుల్లో సంక్రాంతి పండుగ ప్రారంభమవుతున్న సందర్భంగా సంక్రాంతి విశిష్టతను తెలియజేస్తూ వేదిక వద్ద ఏర్పాటు చేసిన భోగిమంటలు, గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల సంకీర్తనలు, విద్యార్థుల నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఏపీ సాఫ్ట్బాల్ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోటీలు ఈనెల 15 వరకు కొనసాగనున్నాయని నిర్వాహకులు తెలిపారు. రెండోరోజు బుధవారం జరిగిన పోటీలను తిలకించేందుకు క్రీడాకారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.